వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం రాయికల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, మందుల నిల్వలు, పారిశుద్ధ్యం, రికార్డుల నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.
రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రత, సమయపాలన పాటించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

