వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రామగుండం రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు.
మహిళా పోలీస్ సిబ్బందితో వాహనదారులకు రాఖీలు కట్టించి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సక్రమ పత్రాలతో ప్రయాణించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

