వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెస్సార్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

