వార్తలకు తిరిగి వెళ్లండి
పీయూ పరిశోధనకు పేటెంట్ గుర్తింపు

పాలమూరు విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం రూపొందించిన పునర్వినియోగ ఆక్సీకరణ కారకాలకు ఇండియన్ పేటెంట్ లభించింది. ఆరేళ్ల పరిశోధనతో నీటిలో రసాయన చర్యలు నిర్వహించే పర్యావరణహిత విధానాన్ని అభివృద్ధి చేశారు.
ఆచార్యులు చంద్రకిరణ్, పరిశోధక విద్యార్థి శ్రీనివాస్, అధ్యాపకుడు రామరాజు ఈ పరిశోధనలో భాగమయ్యారు. ఈ విధానం ఔషధ, రసాయన పరిశ్రమలకు ఉపయోగకరమని తెలిపారు.
Comments
Loading comments...