వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు పట్టణంలోని తహశీల్దార్ కూడలి, బోసు బొమ్మ జంక్షన్, పెద్ద బజార్ జంక్షన్లు ఆదివారం వినాయక చవితి పూజ సామగ్రి కొనుగోలుదారులతో రద్దీగా ఉన్నాయి. వినాయక ప్రతిమలు, పువ్వులు, పళ్లు, పత్రి కొనుగోళ్లు సాగాయి.
పూజ సామగ్రిని అధిక ధరలకు అమ్ముతున్నారని, అరటి పళ్ళు డజన్ రూ.100 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

