వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల పట్టణ శివారులోని గోదావరి వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనులకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శ్రీకారం చుట్టారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని వారు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో DCP భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఉన్నారు.
Comments
Loading comments...

