Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లేరుగుడ్డు వలస గిరిజనులకు అండగా సీపీఎం

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 7:02 PM పార్వతీపురం మన్యంGeneral
పుల్లేరుగుడ్డు వలస గిరిజనులకు అండగా సీపీఎం - Udayam
పుల్లేరుగుడ్డు వలస గిరిజనుల భూముల్లో పంటలను యంత్రాలతో నాశనం చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. పార్వతీపురంలో సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు కె. సుబ్బారావమ్మ, జిల్లా కార్యదర్శి కె. గంగునాయుడు మాట్లాడుతూ.. సాగు చేసుకుంటున్న గిరిజనులకు చట్ట ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం వరకు గిరిజనులకు అండగా పోరాడుతామని తెలిపారు.

Comments

G
Loading comments...