వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎంపీడీవో కార్యాలయాల్లో నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు ప్రజల నుంచి వినతులు, సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రజల దూరభారాన్ని తగ్గించి, సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

