Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 11:32 AM హైదరాబాద్తెలంగాణ
మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి - Udayam Digital
ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో కార్యక్రమం జరగనుంది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...