వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి సేవలను మండల స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు.
ఎంపీడీవో పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు హాజరవుతారు. దరఖాస్తులను పోర్టల్లో నమోదు చేసి ఐడీ అందజేయనున్నారు. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...

