వార్తలకు తిరిగి వెళ్లండి
మార్కాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నిహారిక రెడ్డి Jun 23, 2026 2:35 AM ప్రకాశం 9 viewsabout 1 hour ago

మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 179 అర్జీలు స్వీకరించారు. వీటిలో 101 రెవెన్యూ పరమైనవి కాగా, మరో 78 ఇతర సమస్యలకు సంబంధించినవి.
అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ముఖ్యంగా భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...