వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజాదర్బార్: సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సత్యప్రభ హామీ
భవేష్ కుమార్ Jun 26, 2026 10:07 AM తూర్పుగోదావరి 3 viewsabout 2 hours ago

ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. గృహ నిర్మాణం, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ మరియు రెవెన్యూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు.
ప్రజల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...