వార్తలకు తిరిగి వెళ్లండి
తల్లికి చేరిన బాలిక: పోలీసుల చొరవకు ప్రశంసలు
వివేక్ గౌడ్ Jun 26, 2026 11:46 AM మన్యం జిల్లా 6 viewsabout 2 hours ago

విజయనగరం నుండి వస్తుండగా బొబ్బిలి బస్ స్టేషన్లో తప్పిపోయిన బాలికను, పార్వతీపురం మహిళా పోలీసులు చాకచక్యంగా తల్లి రజిని వద్దకు చేర్చారు. తల్లి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని పాపను సురక్షితంగా రప్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు, ప్రయాణాల్లో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సకాలంలో స్పందించి బాలికను చేర్చిన పోలీసులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...