వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జయరామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఓబులవారిపల్లి మండలం సున్నపురాళ్లపల్లెలో కూలీలతో మాట్లాడిన ఆయన, పనుల్లో యంత్రాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కూలీలందరికీ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీ కూలీల పట్ల ప్రభుత్వం చొరవ చూపాలని జయరామయ్య విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

