వార్తలకు తిరిగి వెళ్లండి

సమీకృత కలెక్టరేట్లో నేడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి వివేక్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
అధికారులు విధుల్లో ఉండటంతో ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

