వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండల ప్రజలు పశువుల దొంగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై విమల సూచించారు. మండలంలో పశువుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో నిఘా పెట్టాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

