వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య అధికారులకు వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, గీజర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

