Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతులూరు ప్రభుత్వ భూములపై దళితుల నిరసన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 12:19 PM అనంతపురంGeneral
జంతులూరు ప్రభుత్వ భూములపై దళితుల నిరసన - Udayam
బీకే సముద్రం మండలం జంతులూరు గ్రామంలోని ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ దళితులు సోమవారం అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తప్పెట్ల మోతతో నిరసన తెలిపారు. 2023లో భూమిని ఇతరుల పేర్లపై వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి పాసుపుస్తకాలు జారీ చేశారని ఆరోపించారు. భూమిని దళితుల ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని ఆధారాలు చూపుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...