వార్తలకు తిరిగి వెళ్లండి
జహీరాబాద్ ఆసుపత్రి వద్ద ఉద్యోగుల నిరసన

వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ఎదుట వైద్య ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పూర్తిస్థాయి కమిషనర్ను నియమించాలని, బదిలీలు, పదోన్నతులు, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు సకాలంలో చెల్లించాలని, ఎంటీఎస్ ఉద్యోగాలను ఖాళీలుగా చూపవద్దని కోరారు. ఈ నిరసనలో ఫార్మసిస్టులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...