Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 10:06 PM కరీంనగర్క్రైమ్
ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి - Udayam
ఇంటి ఆవరణలోని బావిలో పడి యువతి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన బోగం ప్రసన్న లక్ష్మి (30) బావి నుంచి నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...