వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తిని పెంచుకోవాలని జన్నారం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. ప్రకృతి వ్యవసాయం మిషన్ లో భాగంగా లింగయ్యపల్లెలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఏఈఓ అక్రమ్ అవగాహన, క్షేత్ర సందర్శన నిర్వహించారు.
పంటల మేలు కోసం సహజ ఎరువులను వాడాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి సఖిలు జక్కుల రజిత, అంజలి, రైతులు దుంపటి రాజమల్లయ్య, దుంపటి నర్సయ్య, పెనగరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

