వార్తలకు తిరిగి వెళ్లండి

కంబాలరాయుడుపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన హెల్త్ సెంటర్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో కంబాలరాయుడుపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

