వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు, వినతుల వివరాలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

