వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులోని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హుస్సేన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించేందుకు ఇంటింటికీ తిరుగుతూ దరఖాస్తులు నింపుతున్నారు. అవగాహన లేక ఇబ్బంది పడేవారికి అవసరమైన పత్రాల నమోదులో సహకరిస్తున్నారు.
ఒక్క అర్హుడు కూడా పథకానికి దూరం కాకూడదనే ఈ సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సాయి, పింటూ, అంజి, మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

