వార్తలకు తిరిగి వెళ్లండి

టీనేజ్లో ఆకర్షణను ప్రేమగా భావించి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజాం రూరల్ సీఐ హనుమంతు ఉపేంద్ర సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రేమ భావోద్వేగంతో కాకుండా బాధ్యతతో కూడి ఉండాలన్నారు.
పెద్దలను ఎదిరించి ఇళ్ల నుంచి వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నవ మాసాలు మోసిన తల్లిదండ్రుల ప్రేమకు మించినది ఈ లోకంలో మరొకటి లేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

