Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో పత్తి పంట మునిగింది

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 3:28 PM ఆసిఫాబాద్General
ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో పత్తి పంట మునిగింది - Udayam
పెంచికల్‌పేట్ మండలంలో ప్రాణహిత నది బ్యాక్‌వాటర్ ప్రభావంతో గుండేపల్లి–కమ్మర్‌గాం గ్రామాల మధ్య వందల ఎకరాల పత్తి చేనులు నీటమునిగాయి. భారీ వర్షాలతో నీటిమట్టం పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టామని, నీటమునగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...