వార్తలకు తిరిగి వెళ్లండి

పోతంగల్: పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పోతంగల్ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలు, మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన చర్యలపై షీ టీం సిబ్బంది అవగాహన కల్పించారు.
పీహెచ్సీ డాక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో ఆరోగ్య, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, టీకాలు వేశారు.
Comments
Loading comments...

