Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్లలో విశాఖ మహిళ అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:56 PM అల్లూరి General
పోరుమామిళ్లలో విశాఖ మహిళ అనుమానాస్పద మృతి - Udayam
విశాఖపట్నంలోని ధర్మానగర్‌కు చెందిన వరలక్ష్మి కడప జిల్లా పోరుమామిళ్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె గిద్దలూరుకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ యోహాన్‌తో సహజీవనం చేస్తోంది. కడపలో నర్సుగా పనిచేస్తున్న వరలక్ష్మికి ఇద్దరు సంతానం కాగా, ఒకరికి పెళ్లయింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...