వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాండ్ లో కూలి పనులకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది.
సంతబొమ్మాళి (M) కాపుగోదాయవలస గ్రామానికి చెందిన రాంబాబు (37) పది నెలల క్రితం పోలాండ్ దేశానికి కూలి నిమిత్తం వెళ్లాడు. అక్కడే అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని భార్య లావణ్య తెలిపారు. ఇంటి పెద్ద దిక్కు అకాల మరణం చెందడంతో రోడ్డున పడ్డామని ఆమె బోరున విలపించారు.
Comments
Loading comments...

