Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలంలో పిడుగు పడి రైతు మృతి

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 8:07 PM ఖమ్మంGeneral
పొలంలో పిడుగు పడి రైతు మృతి - Udayam
వేంసూరు మండలం లచ్చన్నగూడెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన పర్స ఆనందరావు (52), తండ్రి అంజయ్య, పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. భారీ వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో పిడుగు పడటంతో ఆనందరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...