Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరంపై రాజకీయ సెగలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:24 AM ఆల్ ఇండియా జాతీయ
వందేమాతరంపై రాజకీయ సెగలు - Udayam
కాంగ్రెస్‌ కార్యాలయంలో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని అమిత్‌ షా ఆరోపించారు. జాతికి, బంకించంద్ర ఛటోపాధ్యాయకు ఆమె క్షమాపణ చెప్పాలని రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌ సభలో డిమాండ్‌ చేశారు. ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే భాజపా వందేమాతరం అంశాన్ని ప్రస్తావిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...