వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో బ్రేకులు విఫలమై పోలీసు వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందారు. ఎస్సై అశోక్కుమార్, హెచ్సీ నాగేంద్రప్రసాద్, డ్రైవర్ రాజాబాబు గాయపడ్డారు.
కేసు దర్యాప్తు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకటరమణ కుటుంబానికి ప్రభుత్వం సాయం అందిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Loading comments...

