వార్తలకు తిరిగి వెళ్లండి
జంటహత్యల కేసు ఛేదించిన పోలీసులు

కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంటహత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల వేటలో పోటీదారులవుతారనే అనుమానంతో సుపారీ ఇచ్చి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
గుడివాడకు చెందిన ‘వీఆర్ బాయ్స్’గా పిలిచే నలుగురు ఈ హత్యల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం మృతదేహాలను బైక్కు కట్టి నీటిలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...