వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం జిల్లాలో పలుచోట్ల కాలనీలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలో అధికారులతో నిర్వాసితుల సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
లక్కొండ, ఎల్లవరం, జడ్డంగి, కొత్తపల్లి, వేటమామిడి గ్రామాల్లో కాలనీల నిర్మాణానికి స్థల సేకరణ ముమ్మరంగా జరుగుతోందన్నారు. అర్హులైన నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

