Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొడి వాతావరణంతో తగ్గుతున్న తేమశాతం

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 10:16 AM మంచిర్యాలGeneral
పొడి వాతావరణంతో తగ్గుతున్న తేమశాతం - Udayam
దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పడిన పొడి వాతావరణంతో నేలలో తేమ శాతం తగ్గుతోంది. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ అధికారుల సూచన మేరకు పలు గ్రామాల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. పత్తి, కంది జొన్న, మొక్కజొన్న పంటలను రైతులు వేశారు. ఆయా పంటలకు నేలలో తేమశాతం ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. అయితే మండలంలో చాలా రోజులుగా వర్షం కురవక పోవడంతో తేమశాతం తగ్గిందని రైతులు వాపోయారు.

Comments

G
Loading comments...