Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట రుణాలు మాఫీ చేయాలని సీపీఐ డిమాండ్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:22 PM పల్నాడుGeneral
పంట రుణాలు మాఫీ చేయాలని సీపీఐ డిమాండ్ - Udayam
దాచేపల్లి తహశీల్దార్‌కు ఏపీ రైతు సంఘం నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మందపాటి రమణారెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను వెంటనే మాఫీ చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...