వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా పిట్టల ఎల్లయ్యపల్లెలో ఉపాధ్యాయులు వినూత్నంగా బడిబాట నిర్వహించారు. బడిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు వారు ఒక మొక్కను బహుమతిగా అందజేశారు.
దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే ఇళ్లలో పచ్చదనం పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

