వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం రాజమండ్రి వద్ద గోదావరిలోకి దూకిన ఘటన విషాదం నింపింది. నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
ఈత రావడంతో మనవడు ఒడ్డుకు చేరాడు. నూకరాజు, మీనా, సౌజన్య ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనతో పిఠాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

