వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసపు తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పిడుగురాళ్లలోని గంగమ్మ తల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించారు.
తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి తరలివచ్చి పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలంతో గంగమ్మ తల్లి దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
Comments
Loading comments...

