Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 30, 2026 5:08 PM మంచిర్యాలతెలంగాణ
వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam Digital
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గోడ కూలిన ఘటనలో గాయపడిన ఆల్గాం గ్రామానికి చెందిన బాధితులను పరామర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, వర్షాల వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...