వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కారణంగా ఇప్పటికే అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత, సంతబొమ్మాళి జడ్పీటీసీ పాల వసంతరెడ్డి అన్నారు. పోర్టు సమీప భూములను కెమికల్ ఫ్యాక్టరీలకు ఇవ్వొద్దని కోరారు.
కెమికల్ పరిశ్రమలతో మత్స్యకారులు, రైతులు, కూలీల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. స్థానికులకు ప్రయోజనం, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను మాత్రమే తీసుకురావాలని మీడియా సమావేశంలో కోరారు.
Comments
Loading comments...

