వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం పాండవుల మెట్ట సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ రోడ్డుపై ప్రత్యక్షమైంది. కొండచిలువను చూసిన యువకులు కేరింతలు కొట్టారు. దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రాజమండ్రి, పెద్దాపురం ప్రధాన రహదారిపై వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు.
అనంతరం కొండచిలువ క్షేమంగా పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. పాండవుల మెట్ట ప్రాంతం నిర్మాణాలతో నిండిపోవడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

