వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్పత్రిలో ఫ్యాన్ పడి రోగి మృతి

ఢిల్లీలోని గురు తేజ్ బహుదూర ఆస్పత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి అక్బర్ అనే రోగి మృత్యువాత పడ్డాడు. శనివారం రాత్రి వార్డు నంబర్ 27లో చికిత్స పొందుతున్న ఆయనపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ పడింది.
తీవ్ర గాయాలపాలైన రోగి ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఐరన్ రాడ్ పగుళ్లిపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు వార్డు సిబ్బంది వెల్లడించారు.
Comments
Loading comments...