వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద పార్వతి (సుందిళ్ల) బ్యారేజీకి వరద ప్రవాహం చేరక ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. బ్యారేజీ అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు.
ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో ఎప్పుడైనా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...
