వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ మండలంలో యజమాని ఇంట్లో దాచిన బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసిన పాలేరు, అతడి సహచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
చోరీ చేసిన నగలను ఇద్దరూ పంచుకుని ఇంటి శౌచాలయంలో గుంత తవ్వి దాచినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

