వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని కౌన్సిలర్లు విష్ణువర్ధన్, ఉషన్న విద్యుత్ శాఖ ఏఈని కోరారు. వర్షాకాలంలో పాత స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.
వెంటనే వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. కొత్త స్తంభాల ఏర్పాటులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

