వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్ అరవ లక్ష్మితో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

