Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారాపురం‌లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 7:35 PM శ్రీకాకుళంGeneral
పారాపురం‌లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ - Udayam
​రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సర్వ భూ హక్కులు కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను సిద్ధం చేసిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. రైతులకు ఎటువంటి భూ వివాదాలు లేని విధంగా సర్వే నిర్వహించి వీటిని రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...