వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం తొలుసూరుపల్లి గ్రామానికి చెందిన తులసమ్మ (75) గురువారం పాముకాటుకు గురై మృతి చెందింది.
ఇంటి సమీపంలోని వీరపాదులకు నీరు పోస్తుండగా నాగుపాముపై కాలు వేయడంతో కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తులసమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

