వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
ఒక్క విద్యార్థి.. ఒక్కరే టీచర్.
వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఈ బడి వార్తల్లో నిలిచింది. ఇక్కడ రెండో తరగతి చదువుతున్న విక్కీపాల్ అనే బాలుడి కోసం టీచర్ జగన్మోహన్రావు రోజూ విధులకు హాజరవుతున్నారు.
కోనాపురం గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడంతో మిగతా 19 మంది విద్యార్థులు వేరే పాఠశాలకు మారారు. ప్రస్తుతం ఈ ఏకైక చిన్నారి కోసమే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ, మధ్యాహ్న భోజనం వండిస్తున్నారు.
Comments
Loading comments...